PAN Aadhaar: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).. పాన్-ఆధార్​​ లింక్​ చేసేందుకు మార్చి 31తో గడువును ముగించింది. అయినప్పటికీ జరిమానాతో ఇంకా కొంత కాలం పాటు పాన్​-ఆధార్ లింక్ చేసేందుకు అవకాశం ఉంది. మరి ఫైన్​తో ఈ ప్రక్రియ ముగించేందుకు గడువు ఎప్పటి వరకు ఉంది? పాన్​-ఆధార్​ అనుసంధానం చేయకుంటే వచ్చే సమస్యలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్​-ఆధార్​ లింక్ చేసేందుకు తుది గడువు మార్చి 31తో ముగిసినప్పటికీ.. సీబీడీటీ కొంత ఊరటనిచ్చింది. జరిమానాతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు 2023 మార్చి 31 వరకు అకాశం కల్పించింది. అందులో ఈ ఏడాది జూన్ వరకు రూ.500 జరిమానా ఆ తర్వాత రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


ఫైన్​తో కూడా పాన్​-ఆధార్​ లింక్ చేయకుంటే.. ఆ పాన్​ కార్డులు నిరుపయోగంగా మారుతాయని వెల్లడించింది సీబీడీటీ. దీనర్ధం పాన్ నంబర్​ పని చేయదు.


పాన్​ ఇన్ యాక్టివ్​గా మారితే.. బ్యాంకు లావాదేవీలపై పరిమితులు ఉంటాయి. పెట్టుబడులు పెట్టలేరు (స్టాక్ మార్కెట్ల వంటివాటిలో). ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయడం కూడా కుదరదు.


పాన్​ నిరుపయోగంగా మారితే.. రీఫండ్స్​ కూడా రావు. దీనితో ఆదాయపు పన్ను విభాగం నుంచి భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి రావచ్చు.


పాన్​ నిరుపయోగంగా మారిన వారి నుంచి సాధారణం కన్నా అధికంగా పన్ను వసూలు చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.


Also read: FASTag collections: రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు..మార్చిలో ఎంతంటే..?


Also read: Renault offers: రెనో కార్లపై అదిరే ఆఫర్లు.. రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook