Petrol Price Today: ఇంధన ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. గడిచిన 16 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు మరో 80 పైసల భారాన్ని చమురు సంస్థలు విధించాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 105.41గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.67 వద్దకు చేరుకుంది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ను రూ. 120.51 ధరకు విక్రయిస్తుండగా.. డీజిల్ ధరను రూ. 104.77గా అమ్ముతున్నారు. 


తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల వివరాలు..


తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49కు చేరగా.. డీజిల్ ధర రూ. 105.49గా ఉంది. 


మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో లీటర్ పెట్రోల్, డీజిల్ పై వరుసగా 87, 83 పైసలు మేర పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 121.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 106.87 వద్దకు చేరుకుంది.  


Also Read: Petrol Price Today: భారీగా పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ ధర రూ.120!


Also Read: HDFC Merger News: హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన షేర్ వాల్యూ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook