Petrol Price Today: భారీగా పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ ధర రూ.120!

Petrol Price Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ లపై 80 పైసలను పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపుతో ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 120 పైకి చేరుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 09:12 AM IST
Petrol Price Today: భారీగా పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ ధర రూ.120!

Petrol Price Today: ఇంధన ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. గడిచిన 15 రోజుల్లో 13వ సారి ఇంధన ధరలను రూ. 9.20 మేర పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 80 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.61కు చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.87గా ఉంది. 

మరోవైపు ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ పై 84 పైసల పెంపుతో రూ. 119.67కు చేరుకుంది. డీజిల్ పై మరో 85 పైసల వడ్డనతో లీటర్ రూ. 103.92కు విక్రయిస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 91 పైసలు పెంపుతో.. పెట్రోల్ ధర రూ. 118.57కు చేరింది. డీజిల్ పై మరో 87 పైసల భారంతో రూ. 104.62కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధర రూ. 120పైకి చేరుకుంది. పెట్రోల్ పై 88 పైసల పెంపుతో రూ. 120.39కు చేరగా.. డీజిల్ ధర రూ. 106.04గా ఉంది. 

Also Read: HDFC Merger News: హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన షేర్ వాల్యూ!

Also Read: Petrol Diesel Price Hike: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈసారి ఎంత పెరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News