బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు సైతం భారీగా పుంజుకున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.380 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,330కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.350 పెరగడంతో ధర రూ.47,050 అయింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా ఢిల్లీ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు (Gold Rate in Delhi)  తాజాగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.310 పెరగడంతో ధర రూ.54,100కి ఎగసింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.290 పెరగడంతో ధర రూ.49,600కి చేరింది.



 


గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన వెండి ధరలు (Silver Rate in India) తాజాగా భారీగా పెరిగాయి. తాజాగా వెండి ధర రూ.1500 మేర భారీగా పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.63,500వద్ద మార్కెట్ అవుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో మార్కెట్ అవుతుంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe