బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు పుంజుకోగా, వెండి సైతం పసిడి దారిలోనే పయనిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) రూ.440 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,380 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపూ రూ. 410 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,020 వద్ద మార్కెట్ అవుతుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఢిల్లీ మార్కెట్‌లో గత వారం రోజులుగా బంగారం ధరలు (Gold Price in Delhi) పెరుగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.440 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.55,040 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,460కి చేరింది.



 


బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) వరుసగా పెరుగుతున్నాయి. దీంతో కేజీ వెండి ధర రూ.65 వేల మార్కు చేరుకుంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.900 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.65,410 అయింది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe