Shraddha Walker type of Murder in Andhrapradesh: ప్రపంచంలో జరిగే నేరాలన్నీ ఒకటి డబ్బు కోసం లేదా స్త్రీ కోసం జరుగుతూ ఉంటాయని ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా డైలాగులు రాస్తున్నారు రైటర్లు. ఆ డైలాగులను నిజం చేసేలా ఏ క్రైమ్ చూసినా దాని వెనుక డబ్బు లేదా మహిళలే ప్రధాన కారణం అవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక దారుణమైన హత్యాకాండ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి గ్రామంలో ఒక దారుణమైన హత్య కాండ జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడేమో అని అనుమానంతో తన తోటి ఉద్యోగిని ఒక ఔట్సోర్సింగ్ పంచాయతీ ఉద్యోగి దారుణంగా హత్య చేశాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ హత్యను తన కుమారుడితో కలిసి చేయడంతో ఇప్పుడు సదరు మైనర్ బాలుడికి కూడా చిక్కులు తప్పలేదు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి పంచాయతీలో సైదులు, కోటేశ్వరరావు అనే వ్యక్తులు అవుట్సోర్సింగ్ ప్లంబర్లుగా పనిచేస్తున్నారు. దీంతో ఒకరి ఇంటికి ఒకరికి రాకపోకలు ఉండేవి. అయితే తన భార్యతో కోటేశ్వరరావు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని సైదులు అనుమానం పెంచుకున్నాడు.


ఇదే విషయాన్ని భార్యను పలమార్లు అడిగినా ఆమె కాదన్నది కానీ కోటేశ్వరరావు మీద అనుమానం మాత్రం సైదులుకి తగ్గలేదు. ఈ క్రమంలో తన విధి నిర్వహణలో భాగంగా కోటేశ్వరరావు విద్యుత్ మోటార్ ఆపివేసేందుకు ఒక ప్రాంతానికి వెళ్ళగా అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న సైదులు అతని కుమారుడు ఇద్దరూ దారి కాచి ఇనప రాడ్లతో దాడి చేయడంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే మరణించాడు. దీంతో అతని మృతదేహాన్ని సంచిలో వేసుకుని సైదులు తన పొలం వద్దకు తీసుకు వెళ్లాడు. కోటేశ్వరరావు మృతదేహాన్ని పొలం తీసుకెళ్లి మిర్చి పంట మధ్యలో వేసి సుమారు 16 ముక్కలుగా కోసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.


అయితే కోటేశ్వరరావు సాయంత్రం ఇంటికి రావాల్సింది రాత్రి 10:00 అవుతున్న ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. అన్ని చోట్లా వెతుకుతూ సైదులు పొలం దగ్గరికి కూడా వచ్చి కోటేశ్వరరావు కనిపించాడా అని అడిగితే కనిపించలేదని తండ్రీకొడుకులు హడావుడిగా వెళ్లిపోతుండడంతో వారి మీద అనుమానం వచ్చింది వెంటనే వెళ్లి అక్కడే వెలుగుతున్న మంట దగ్గర పరిశీలిస్తే కోటేశ్వరరావు పాదం కనిపించింది.


వెంటనే వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి సైదులు అతని కుమారుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రాథమికంగా వారు హత్య చేసినట్లు ఒప్పుకున్నా సరే వివాహేతర సంబంధం కోణంల్లోనే హత్య చేశారా? లేక ఆర్థిక లావాదేవీలు వంటివి ఏమైనా ఉన్నాయా? అనే విషయం మీద కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఢిల్లీలో కలకలం రేపైనా శ్రద్ధ వాకర్ హత్య కేసులో కూడా శ్రద్ధ వాకర్ను ఆమె లివింగ్ రిలేషన్ షిప్ పార్ట్నర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలా సుమారు 36 ముక్కలు చేసి అడవిలో చల్లి వేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అలాంటి ఘటనలే అనేకం తెరమీదకు వస్తున్న వ్యవహారం షాక్ కలిగిస్తోంది.
Also Read Amala Paul Photos: మళ్లీ మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ అమలాపాల్.. బోల్డ్ అవతారంలో ముద్దులతో రచ్చ


Also Read: Rithu Chowdary Back to Form: ఆ బాధ నుంచి బయట పడి మళ్లీ మొదలెట్టిన రీతూ చౌదరి.. దెబ్బకు మానేశారే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook