Woman Committed Suicide In Tirumala: అధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. మహిళ నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తిరుమలలోని ఓ హోటల్‌లో పని చేస్తున్న మహిళ.. వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న వాష్ రూమ్‌లోకి వెళ్లి ఒంటికి నిప్పంటించుకుంది. శౌచాలయం నుంచి పొగలు రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టగా.. మహిళ మంటల్లో కాలుతూ కనిపించింది. మంటలను వెంటనే ఆర్పేసి ఆమెను కాపాండేందుకు ప్రయత్నించినా.. అప్పటికే మరణించింది. మృతి చెందిన మహిళను విజయవాడకు చెందిన సుమతి (53)గా పోలీసులు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో తిరుమల క్షేత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భక్తులు ఆందోళనకు గురవ్వగా.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టీటీడీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. 


Also Read: Cheteshwar Pujara: పుజారా కోసం రోహిత్ శర్మ వికెట్ త్యాగం.. వందో టెస్టులో ప్రత్యేకం  


Also Read: Tamilisai Soundararajan: కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై.. ఇదే బ్రేకింగ్ న్యూస్ అంటూ కామెంట్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి