Abhishek Bachchan shares his Experience: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వినాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. నాయకులు.. ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కొడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య అందరూ కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా బారిన పడి కోలుకున్న అనుభవాలను తాజాగా సూపర్‌స్టార్ తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వీడియోను షేర్ చేశారు. కరోనాను తెలిగ్గా కొట్టిపారేయొద్దంటూ ఆయన అందరికీ సూచించారు. Also read: Rhea Chakraborty's bail plea: రియాకు మరోసారి షాక్



కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ.. ఎక్కడున్నా.. ఎటువెళ్లినా మాస్క్ ధరించాలని.. కరోనావైరస్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు.. అందరూ మాస్క్ ధరిస్తూ సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం అంటూ అభిషేక్ సూచించారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో తనకు, తన కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు అభిషేక్ బచ్చన్.  Also read: Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు