Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్‌ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Last Updated : Sep 11, 2020, 11:26 AM IST
Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు

Parliament Monsoon Session: న్యూఢిల్లీ: పార్లమెంట్‌ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా (Coronavirus) వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై (Parliament monsoon session) గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలన్నీ సాధ్యమైనంత వరకు డిజిటలైజ్‌ చేస్తున్నామని ఓంబిర్లా తెలిపారు. ఈ దఫా తొలిసారి లోక్‌సభ ఎంపీలు తమ అటెండెన్స్‌ను మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకోవాలని వివరించారు. కరోనా నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఇలా డిజిటల్‌ అటెండెన్స్‌ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సభ్యులందరూ ఆర్టీపీసీఆర్ కరోనా టెస్టులు చేయించుకోవాలన్నారు. Also read: Parliament Session: పార్టీ రాజ్యసభ సభ్యులకు బీజేపీ విప్

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ లోపల సభ్యుల మధ్య భౌతికదూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేయడంతోపాటు ఎల్‌సీడీ తెరలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో 257 మంది లోక్‌సభ హాల్లో, 172 మంది లోక్‌సభ గ్యాలరీలో, 60 మంది రాజ్యసభలో, 51 మంది రాజ్యసభ గ్యాలరీలో కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు స్పీకర్ తెలిపారు. అయితే 14వ తేదీన లోక్‌సభ ఉదయం, రాజ్యసభ మధ్యాహ్నం జరగనుంది. ఆ తర్వాత రోజు నుంచి రాజ్యసభ ఉదయం వేళ, లోక్‌సభ మధ్యాహ్నం వేళ జరగనుంది. అయితే ఈ సభలు నాలుగు.. నాలుగు గంటలు మాత్రమే జరగనున్నాయి. Also read: Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌

Trending News