Actress Keerthi Suresh Corona: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలిబ్రిటీల దాకా ఎవరినీ వదలడం లేదు. సినిమా తారలు వరుసగా కొవిడ్ (Covid-19) బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు నటులకు కరోనా సోకింది. మహేష్ బాబు, త్రిష, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, సీనియర్ నటీమణులు శోభన, మీనా, కుష్బు తదితరులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  తాజాగా అగ్రకథానాయిక కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ (Keerthi Suresh tested positive) గా తేలింది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ స్వయంగా వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నాను.. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారందరు కొవిడ్ పరీక్షలు చేయించుకోండి. దయచేసి కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకొండి. ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే టీకా తీసుకోండి. అప్రమత్తంగా ఉండండి. త్వరలోనే కరోనా నుంచి కోలుకొని తిరిగి వస్తా''.. అంటూ  కీర్తిసురేష్ ట్వీట్ చేసింది. 



Also Read: Renu Desai Corona: పవన్ కల్యాణ్ కుమారుడు అకిరాకు కరోనా- రేణు దేశాయ్ కి కూడా..


నటి కీర్తి సురేష్ కు (Keerthi Suresh) పాజిటివ్ రావడంతో ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. కీర్తి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా (Social Media) వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో... అలాగే చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్' (Bhola shankar) చిత్రంలోను నటిస్తుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook