అడివి శేష్ అంటే వైవిధ్య భరితమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అడివి శేష్ కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాడు. 'క్షణం’ సినిమా విజయవంతం అయిన వెంటనే, బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘2 స్టేట్స్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటించడానికి అడివి శేష్ సైన్ చేశారు. డా రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ నటిగా ప్రారంభమైన తొలి చిత్రం ఇదే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని నెలల ప్రొడక్షన్ తరువాత, ఈ చిత్రం కొన్ని అడ్డంకులను ఎదుర్కొంది. ఆ సమయంలో అడివి శేష్ తన ఇతర ప్రాజెక్టులైన ‘గూడాచారి’, ‘ఎవరు’, ‘మేజర్’ ( Gudachari, Evaru, Major movies ) సినిమాలతో బిజీ అయ్యాడు.


Also read : Adivi Sesh: మేజర్ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది


ప్రస్తుతం ఆ సినిమా నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై 2021 జనవరి 5 లోపు స్పందించాలని న్యాయమూర్తి అడివి శేష్‌కు నోటీసులు ఇచ్చారు. దీనిపై అడివి శేష్ ( Adivi Shesh ) ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook