Allu Arjun - Ram Charan : మెగా అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, బన్నీ తన అల్లు బ్రాండ్‌ను సపరేట్‌గా బిల్డ్ చేసుకుంటున్నాడని, అందుకే మెగా ట్యాగ్‌కు దూరంగా ఉంటున్నాడనే టాక్ ఎక్కువైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కూడా తన సొంత బ్రాండ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. బన్నీ ఈ మధ్య మెగా పదాన్ని కూడా వాడటం లేదు. పైగా నందమూరి వారికి దగ్గరగా ఉంటున్నాడు. బాలయ్య అఖండ ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథిగా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అల్లు మెగా బంధం తాజాగా మరోసారి అందరికీ అర్థమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ ఉపాసన ఒక దగ్గర కూర్చున్నారు. అయితే పక్కనే సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చి కూర్చున్నాడు. దీంతో కాస్త ఫ్రీగా కూర్చుందామని ఉపాసనను పక్కకెళ్లి.. అమ్మ వద్ద కూర్చో అని చెప్పినట్టున్నాడు. దీంతో ఉపాసన కాస్త కోపంగానే నవ్వుతూ వెళ్లి కూర్చుంది.


 



కాసేపటి తరువాత బన్నీ కూడా అదే పని చేశాడు. బన్నీ, సురేఖ, ఉపాసన ఒక సోఫాలో కూర్చున్నారు. కాసేపటి తరువాత రామ్ చరణ్‌ని బన్నీ పిలిచాడు. అదేదో యాడ్‌లో పిలిచినట్టుగా.. రా రా పక్కన కూర్చో అన్నట్టుగా చెర్రీని బన్నీ పిలిచాడు. దీంతో మళ్లీ ఉపాసన లేవాల్సి వచ్చింది. సురేఖ సైడుకు జరిగింది. ఉపాసన వెళ్లి సాయి ధరమ్ తేజ్ పక్కన కూర్చున్నట్టుంది.


బన్నీ పక్కన రామ్ చరణ్‌ కూర్చున్నాడు. రామ్ చరణ్ పక్కన సురేఖ కూర్చున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి బంధం ఇంత చక్కగా ఉందంటూ నెటిజన్లు వీడియోను షేర్ చేస్తున్నారు. బావ, బావమరిదిల బంధం అంటూ మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. 


Also Read : Anasuya Husband : అనసూయ రొమాంటిక్ యాంగిల్


Also Read : Adipurush Teaser : టీజర్ ట్రోల్స్‌పై ఓం రౌత్ రియాక్షన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook