Anchor Pradeep Father Death News | యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ నటుడు ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు(65) కన్నుమూశారు. కరోనా మహమ్మారి గత ఏడాది నుంచి ఎంతో మంది సెలబ్రిటీల ఇళ్లల్లో విషాదాన్ని నింపింది. కోవిడ్19 మహమ్మారి తాజాగా నటుడు ప్రదీప్ ఇంట్లోనూ తీరని నష్టాన్ని మిగిల్చింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటుడు ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. కరోనాకు చికిత్స పొందుతూనే శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ తండ్రి మరణంపై టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. యాంకర్‌గా బుల్లితెరపై రాణించిన ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) ఇటీవల విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 


Also Read: Telangana COVID-19 Cases: తెలంగాణలో భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook