Telangana COVID-19 Cases: తెలంగాణలో భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

Telangana COVID-19 Positive Cases And Deaths : ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, కరోనా పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,430 మంది కరోనా బారిన పడ్డారు. సెకండ్ వేవ్‌ ప్రభావం ఇతర రాష్ట్రాలతో సహా తెలంగాణలో అధికంగా ఉంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 2, 2021, 11:32 AM IST
  • తెలంగాణలో తాజాగా 7,430 మంది కరోనా బారిన పడ్డారు
  • మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది
  • తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల
Telangana COVID-19 Cases: తెలంగాణలో భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ప్రభావం ఇతర రాష్ట్రాలతో సహా తెలంగాణలో అధికంగా ఉంది. ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, కరోనా పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,430 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో 76,330 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 7 వేల 4 వందల 30 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 50 వేల 7 వందల 90కు చేరింది. కరోనా(CoronaVirus) బారిన పడి రాష్ట్రంలో మరో 56 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 2,368కి చేరింది. 

Also Read: Cancer Patients: క్యాన్సర్ బాధితులకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి

తాజా కేసులలో GHMC పరిధిలోనే 1,546 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో ప్రస్తుతం 80 వేల 695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1.30 కోట్ల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19)  బారి నుంచి 5,567 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,67,727 మంది కరోనా మహమ్మారిని జయించారు. రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారు 81.57 శాతం ఉన్నారు. 

45 ఏళ్లు పైబడిన వారు టీకాలు తీసుకునేందుకు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. యువత సైతం కరోనా టీకాల వివరాలు తెలుసుకునేందుకు టీకా కేంద్రాలకు తరలి వస్తున్నారు. కొన్ని చోట్ల తగినన్ని కిట్లు లేక టెస్టులు చేయించుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనుక భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్19 నిబంధనలు పాటించడం, కరోనా టీకాలు తీసుకోవడం ద్వారా కరోనాను తరిమేయాలని సూచిస్తున్నారు.

Also Read: Co-Win Registration: కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవాలో తెలుసా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News