Chiranjeevi speech at Uppena Pre Release Event: చిరంజీవి మేనళ్లుడు, సాయిధరం తేజ్ సొంత సోదరుడు అయిన వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఉప్పెన మూవీ ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు రాబోతున్న నేపథ్యంలో శనివారం రాత్రి Uppena Pre Release Event వేడుక జరిగింది. ఉప్పెన మూవీని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్వహించిన ఈ వేడుకకు మెగాస్టార్ Chiranjeevi చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కొత్త దర్శకుడు బుచ్చి బాబు సాన డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన Krithi Shetty జంటగా నటించగా... ఆమెకు సోదరుడి పాత్రలో విలన్‌గా తమిళ నటుడు Vijay Sethupathi నటించాడు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Anchor Sreemukhi Goa trip photos: గోవా బీచ్‌లో యాంకర్ శ్రీముఖి ఫన్ అండ్ మస్తీ.. ఫోటోలు వైరల్


Uppena Pre Release Event కి చీఫ్ గెస్టుగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి Uppena Movie గురించి మాట్లాడుతూ.. కరోనా కష్టాల తర్వాత తిరిగి తమ సినిమా వాళ్లను ఆధరిస్తున్నందుకు ముందుగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పెన సినిమా చూశాకా తానే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమా ఎంత గొప్పగా ఉందో చెప్పాలనిపించిందని... కానీ అతి కష్టం మీద ఆ కోరికను ఆపుకున్నానని అన్నారు. ఉప్పెన సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉన్నా... ఏమీ చెప్పకూడదని నిర్ణయించుకున్నానని చెప్పిన Chiranjeevi.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతీ ఒక్కరూ చూడదగిన అందమైన దృశ్యకావ్యం ఇది అని అన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook