సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన పద్మావత్ సినిమాలో దీపికా పదుకునే టైటిల్ రోల్ పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, చాలామందికి తెలియని వాస్తవం ఏంటంటే.. ఈ సినిమాకు సైన్ చేయడానికి ఇదే సినిమాలో ఆమెతో కలిసి నటించిన షాహీద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌లకన్నా దీపికా పదుకునెనే ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా అంగీకరించింది. తాజాగా పద్మావత్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపికా పదుకునేని ఇదే విషయం అడగ్గా, ఆమె అవుననే సమాధానం ఇచ్చింది. అయితే, ఆమె తీసుకున్న పారితోషికం వివరాలు తెలుసుకునేందుకు ఆ షో హోస్ట్ నేహా దూపియా ప్రయత్నించినప్పటికీ... డిప్పీ మాత్రం ఆ వివరాలు వెల్లడించకుండానే తెలివిగా తప్పించుకుంది.


సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం దీపికాకు రూ.11 కోట్లు పారితోషికంగా చెల్లిస్తే, ఈ సినిమాలో సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించిన రణ్‌వీర్ సింగ్ సుమారు 7 నుంచి 8 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం.