సాహో ( Saaho ) చిత్రం తరువాత ప్రభాస్ ( Prabhas ) నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అభిమానులు విపరీతంగా ఆదరించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం గురించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో పూజా హేగ్డే ( Pooja Hegde ) కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా రాధేశ్యామ్ ( Radhe Shyam ) లో పూజా డబుల్ రోల్ చేయనుందట. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న మూవీలో ప్రభాస్ కూడా డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడేమో అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



రాధేశ్యామ్ చిత్రం పూర్తయ్యాక మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) తో ఒక సినిమా చేయనున్నాడు ప్రభాస్. ఈ మూవీలో దీపికా పదుకొణె ( Deepika Padukone ) హీరోయిన్ కాగా వైజయంతీ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  సోషియే ఫ్యాంటసీ థీమ్ తో సినిమా ఉంటుంది అని.. సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారని సమాచారం.