RX 100 చిత్రంతో మంచి విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ తరువాత మంచి కాన్సెప్ట్ కోసం కొంత కాలం వేచి ఉన్నాడు. తరువాత విలక్షణ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించుకున్న శర్వానంద్‌తో మరో చిత్రం ప్లాన్ చేశాడు. ఇందులో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి


ఈ చిత్రానికి మహా సముద్రం అని టైటిల్ ఫిక్స్ శాడు. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభం అయింది.  బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దానంటానా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ఫేవరిట్ హీరోగా మారాడు సిద్దార్థ్. 



అయితే గత 8 సంవత్సరాల్లోతెలుగు సినిమాల్లో(Tollywood) నటించలేదు సిద్దార్థ్. చాలా కాలం తరువాత ఈ మహాసముద్రం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఒక ఇన్‌టెన్స్‌ లవ్‌స్టోరిగా తెరకెక్కనుంది. కోవిడ్-19 నివారణ (Covid-19) చర్యలను తీసుకుని షూటింగ్ మొదలుపెట్టాం అని తెలిపాడు దర్శకుడు అజయ్ భూపతి.


Also Read | Smriti Mandhana గురించి మీకు తెలియని విషయాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook