Akhanda Movie: నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) జంటగా నటించిన చిత్రం 'అఖండ'(Akhanda Movie). శ్రీకాంత్ విలన్ గా..బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సీఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలను మించి అఖండ అద్భుత విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Akhanda Release Review: 'మాస్ కా బాప్'- 'అఖండ' విజయాన్ని అందుకున్న బాలయ్య.. సెలెబ్రిటీస్ విషెస్!


కరోనాను కూడా లెక్కచేయకుండా బాలయ్య అభిమానుల మాత్రం థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బాలయ్య హిట్ కొట్టడంతో టాలీవుడ్(Tollywood)కు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడంతో త్వరలోనే సక్సెస్ మీట్ నిర్వహించనుంది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి ఇద్దరు స్టార్స్ రానున్నారని ఓ వార్త ఇప్పుడు నెట్టింట హాల్ చల్ చేస్తోంది. 


Also Read: Akhanda : బాలకృష్ణ తన రికార్డులను తానే బద్దలు కొడ్తాడు.. అఖండపై నందమూరి రామకృష్ణ ప్రశంసలు


అఖండ సక్సెస్ మీట్ వేడుకలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) అతిథులుగా రానున్నట్లు సమాచారం. ఈ వార్తతో నందమూరి అభిమానుల్లో జోష్ పెరిగింది. ఇప్పటికే మహేష్ అటు తారక్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమానికి హాజరయ్యాడు.. అలాగే నట సింహం బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్(umstoppable) టాక్ షో కు కూడా హాజరయ్యాడు. అలాగే మహేశ్ తో తారక్ కు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ అఖండ సక్సెస్ మీట్ కు రానున్నడని తెలుస్తోంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 8న జరగనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook