మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. మోహన్ బాబుకు తమ్ముడైన రంగస్వామి నాయుడుకు 63 సంవత్సరాల వయసు ఉంటుంది. సినీ పరిశ్రమలో మోహన్ బాబు కుటుంబంతో సన్నిహితంగా మెదిలే వాళ్లందరికీ రంగస్వామి నాయుడు పరిచయమే. దీంతో రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్న రంగస్వామి నాయుడుకు భార్య శాంతమ్మ ఉన్నారు. మోహన్ బాబు కుటుంబం తమ స్వస్థలంలో చేపట్టే సామాజిక కార్యక్రమాల్లో రంగస్వామి నాయుడు చురుకుగా పాల్గొనేవారని అతడి గురించి తెలిసిన వారు చెబుతున్నారు. 


Also read : వెండితెరపైకి విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్.. హీరోగా అమీర్ ఖాన్?


రంగస్వామి నాయుడు మృతితో మోహన్ బాబు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం తిరుపతిలో రంగస్వామి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. రంగస్వామి నాయుడు మృతి వార్త తెలుసుకున్న మోహన్ బాబు కుటుంబం హుటాహుటిన తిరుపతికి బయల్దేరింది.


Also read : Sarath Kumar: 'నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook