రణ్ వీర్, షాహిద్ కపూర్, దీపకా పదుకొనే ముఖ్య తారాగణంగా, సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పద్మావతి చిత్రం ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో రణ్ వీర్ "సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ" గా, షాహిద్ కపూర్ "చిత్తోర్ఘడ్ మహారావల్ రతన్ సింగ్" గా, "రాణి పద్మిని (పద్మావతి)" గా దీపికా నటిస్తున్నారు. 


క్రీ.శ. 1303లో ఖిల్జీ చిత్తోర్ఘడ్ పై దండయాత్ర చేసి విజయం సాధించాడు. అందుకే మధ్యాహ్నం ఒంటిగంట మూడు నిమిషాలకు (13:03 గంటలకు) ట్రైలర్ విడుదలచేసి చరిత్రకి, చిత్రానికి అనుసంధానం చేసింది చిత్ర యూనిట్. ఇందులో దీపికా మొదటి ట్రైలర్ లో కన్నా అందంగా కనిపించింది. దీపికా రాజ్ పుత్ ల గురించి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాకు పాటలు కూడా సమకూరుస్తున్నారు. సుమారు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కనున్న ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందు రానుంది.