Dil Raju Father Death: ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్‌ సుందర్‌రెడ్డి (86) సోమవారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ సుందర్ రెడ్డి.. నేడు తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంతో దిల్ రాజు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ప్రముఖులు దిల్‌ రాజుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ధైర్యంగా ఉండాలని.. ఆయన శ్యామ్ సుందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్యాంసుందర్ రెడ్డికి దిల్ రాజుతోపాటు మరో ఇద్దరు కొడుకులు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన దిల్ రాజు.. పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దిల్ రాజు పూర్తి పేరు వెంకటరమణారెడ్డి కాగా.. చిన్నపట్టి నుంచి అందరూ రాజు అని పిలిచేవారు. హైదరాబాద్‌లో మొదట వ్యాపారలు చేసిన రాజు.. సినీ డిస్టిబ్యూటర్‌గా మారిపోయారు. ఆ తరువాత నితిన్‌తో దిల్ సినిమాను నిర్మించడంతో దిల్ రాజుగా మారిపోయారు. దిల్ రాజు మొద‌టి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించగా.. 2020లో తేజస్వినిని రెండో  వివాహం చేసుకున్నారు.


Also Read: Assembly Elections 2023 Live Updates: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఫలితాలు ఎప్పుడంటే..?  


Also Read: CM KCR: ఎన్నికల రంగంలోకి సీఎం కేసీఆర్.. ఆ రోజే మేనిఫెస్టో ప్రకటన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి