సమంత ప్రధాన పాత్రలో నటించిన సస్పె్న్స్ థ్రిల్లర్ యూ టర్న్ మూవీ విడుదలకు సిద్ధమైంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుండగా అదే రోజున ఆమె ముద్దుల హబ్బీ నాగచైతన్య కొత్త సినిమా శైలజా రెడ్డి అల్లుడు కూడా రిలీజవుతుండటం సినీవర్గాల్లో చర్చనియాంశమైంది. భార్యాభర్తలిద్దరూ ఒకిరితో మరొకరు పోటీ పడుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రచారంపై ఇటీవలే స్పందించిన సమంత.. తాను తన యూ టర్న్ సినిమా విడుదలను వాయిదా వేయాల్సిందిగా నిర్మాతలతో మాట్లాడినప్పటికీ.. వాళ్లు అందుకు అంగీకరించలేదని, ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను పోటీకి సిద్ధపడాల్సి వచ్చిందే కానీ ఉద్దేశపూర్వకంగా కాదని సమంత పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అభిమానుల సందేహాలను నివృత్తి చేయడానికి స్వయంగా సమంతనే తాజాగా ఫేస్‌బుక్ ద్వారా మరోసారి తన అభిమానుల ముందుకొచ్చింది.