Samantha Papped At Mumbai Airport సమంత ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం ఆమె ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. దీంతో అక్కడి కెమెరామెన్లు సమంతను క్లిక్‌మనిపించారు. కానీ సమంత మాత్రం ఒక్క సారి కూడా స్మైల్ ఇవ్వలేదు. ఎంతో సీరియస్‌గా అలా నడుచుకుంటూనే వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత నిన్నే ఓ పోస్ట్ వేసింది. తాను ఎలాంటి పరిస్థితుల్లో శాకుంతలం సినిమా డబ్బింగ్ చెబుతోందో చూపించింది. బెడ్డు మీద పడుకునే శాకుంతలం సినిమా డబ్బింగ్‌ను పూర్తి చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే నిన్న అలా చెప్పి.. నేడు ఇలా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది సమంత. అయితే సమంత మాత్రం పూర్తిగా మారిపోయింది.


యశోద సినిమా సమయంలోనే ప్రమోషన్స్ కోసం బయటకు రాలేదు. మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టుగా సమంత ప్రకటించింది. దీంతో తాను సరిగ్గా నడవలేకపోతోన్నా, నిలబడలేకపోతోన్నాను, అలసటగా ఉండటం అనేది దాని లక్షణాలని అంతా తెలుసుకున్నారు. సమంత ఇప్పుడు మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటోంది.


సమంత మయోసైటిస్ థర్డ్ స్టేజ్‌లో ఉండటంతో ఇంత బాధపడాల్సి వస్తోందని, సమంత ఇప్పుడప్పుడే సినిమా సెట్లోకి అడుగుపెట్టదని, ముందు అయితే ఖుషి సినిమాను పూర్తి చేస్తుందో లేదో తెలియడం లేదని, సమంత అయితే భవిష్యత్తులో చేయబోయే కొత్త సినిమాలకు మాత్రం సైన్ చేయడం లేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ముంబైకి ఎందుకు వెళ్లింది? అనే విషయం తెలియడం లేదు. చూస్తుంటే సమంత ఇప్పుడు కాస్త కోలుకున్నట్టుగానే కనిపిస్తోంది.


Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?


Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి