హైదరాబాద్‌: ప్రముఖ నేపథ్య గాయని సునీత ( Singer Sunitha) తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. చైతన్య అనే ఒక గుర్తు తెలియని వ్యక్తి తన పేరు వాడుకుని అమాయకులను మోసం చేస్తున్నాడని తన దృష్టికి వచ్చిందని.. వాస్తవానికి అలాంటి వ్యక్తులు ఎవ్వరూ తనకు తెలియదని.. వాడితో తనకు ఎటువంటి సంబంధం కూడా లేదని సునీత తెలిపారు. ఫేస్‌బుక్ వేదికగా అభిమానుల కోసం ఓ వీడియో పోస్ట్ చేసిన సునీత.. ఈ వీడియో ద్వారా చైతన్య అనే సదరు వ్యక్తి సాగిస్తున్న మోసాలపై క్లుప్తంగా వివరించారు. దయచేసి అటువంటి వారి మాటలను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సింగర్ సునీత విజ్ఞప్తి చేశారు. Also read: RGV: వర్మపై కేసు నమోదు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Imp. Please listen

Posted by Sunitha on Sunday, July 26, 2020

అనంతపూర్‌కు చెందిన చైతన్య అనే వ్యక్తి సింగర్‌గా చలామణి అవుతూ ఇప్పటికే తన పేరు చెప్పుకుని చాలా మందిని మోసం చేసినట్టుగా మీడియాలో పబ్లిష్ అయిన ఓ ఆర్టికల్ చదివితే కానీ తన దృష్టికి రాలేదని సింగర్ సునీత తెలిపారు. ఇలాంటి వారి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె.. చైతన్య అనే వ్యక్తి కానీ కనిపిస్తే.. వాడి పళ్లు రాలగొడుతానని అన్నారు. Also read: BREAKING: సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియాపై కేసు నమోదు