Tillu Square Movie Trailer Released: ప్రేమ.. హాస్యం.. క్రైమ్‌ కథాంశంతో 'డీజే టిల్లు'తో ప్రేక్షకుల ముందుకువచ్చిన సిద్ధు జొన్నలగడ్డ త్వరలోనే తన రెండో సినిమాతో సందడి చేయనున్నాడు. రాధికతో మోసపోయిన టిల్లు మరో అమ్మాయి చేతిలో మోసపోవడానికి సిద్ధమయ్యాడు. టిల్లు 2.0గా 'టిల్లు స్క్వేర్‌' సినిమా రాబోతున్నది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్రబృందం బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ను చూస్తుంటే 'ఈసారి టిల్లుగాడికి గట్టిగానే దెబ్బ తగిలేటట్టున్నది' అని చెప్పవచ్చు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Valentines Day: ఆంటీకి చెప్పు వద్దని.. నేను నిన్నే చేసుకుంటానని బాయ్‌ఫ్రెండ్‌ ఫన్నీ రిప్లయ్‌


ఈ సినిమాలో అనుపమ పాత్ర ద్వారా టిల్లు చిక్కుల్లో చిక్కుకుంటాడని ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. ట్రైలర్‌ ప్రారంభమే టిల్లు ప్రత్యేకంగా కనిపించాడు. టిల్లుకు సంబంధాలు చూడడంతో ప్రారంభమై అనంతరం రాధికను టిల్లు గుర్తు చేసుకున్నాడు. అనంతరం కారులో సిద్దు, అనుపమ మధ్య గాఢమైన ముద్దు సన్నివేశం దాదాపు పది సెకన్లపైన ఉండడంతో ప్రేక్షకుల్లో వేడిని రేకెత్తించింది. 'నీ బాడీలో నీకిష్టమైన పార్ట్‌ ఏది' అంటే 'నా కళ్లు అని హీరోయిన్‌ చెబుతుంది. 'మరి నీ బాడీలో ఏమిష్టం' అని అడిగితే సిద్ధు 'నా హార్ట్‌ చాలా వీక్‌' అని చెప్పగా హీరోయిన్‌ రొమాంటిక్‌గా చెంపపై కొడుతుంది. 'పోయినసారి కన్నా ఈసారి గట్టిగానే దెబ్బ తగిలేటట్టు ఉన్నది' అని చెప్పడంతో సినిమా కథ అర్థమైంది. హీరోయిన్ ద్వారా మరోసారి టిల్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడనేది కథగా తెలుస్తోంది.

Also Read: IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!


'ఆహా ఇట్లా నవ్వే మా బతుకులను నవ్వులపాలు చేస్తారు మీరంతా' అని సిద్దు ఫిదా అయితాడు. 'టిల్లుగాడిని మేమేం పెంచలేదు. వాడే పెరిగాడు' అని తండ్రి అనడం నవ్వులు తెప్పించింది. 'మీకు డిస్కౌంట్‌ ఇచ్చి నేను షాప్‌ మూసుకునుడు ఏందే థూ' అనే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలతో పాటలు అదిరిపోయాయి. మరోసారి స్టైలీశ్‌గా సిద్ధు కనిపిస్తుండగా.. అనుపమ హాట్‌హాట్‌గా కనిపించింది. ఈ సినిమా మార్చి 29వ తేదీన థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది.


అనుపమ పరమేశ్వరన్‌తో జోడీగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో 'టిల్లు స్క్వేర్‌' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి సినిమా సంచలన విజయం సొంతం చేసుకోవడంతో దాన్ని మించిన సినిమాగా ఈ చిత్రం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. వినోదమే ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రామ్‌ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.