VV Vinayak to direct Chiranjeevi: చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నెంబర్ 151 వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు డైరెక్ట్ చేసిన వివి వినాయక్ త్వరలోనే చిరుతో మరో చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల తన అభిమాన నటుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని వివి వినాయక్ బెంగళూరులో కలిసినట్టు తెలుస్తోంది. బెంగళూరులోనే ఎందుకు కలవాల్సి వచ్చింది ? ఎప్పుడు కలిశారు అనే విషయాల్లో స్పష్టత కొరవడినప్పటికీ.. ఆ ఇద్దరి మధ్య లూసిఫర్ తెలుగు రీమేక్‌పై ( Lucifer Telugu remake ) చర్చ జరిగినట్టు మాత్రం ప్రచారం జరుగుతోంది. Also read : Sanjjana Garlani: డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు వార్తలపై స్పందించిన సంజన


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ( Lucifer ) సినిమాలో మోహన్ లాల్ ( Mohan lal ) ప్రధాన పాత్ర పోషించారు. తాజాగా అదే సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉన్న ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను చిరు వినాయక్ చేతుల్లో పెట్టినట్టు ఫిలింనగర్ టాక్. Also read : Sandalwood Drug Case: నటి రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్


లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం మొదట్లో సాహో ఫేమ్ సుజీత్ రెడ్డిని ( SUjeet Reddy ) ఎంపిక చేసుకున్నట్టు తెలిసినప్పటికీ.. ఆ తర్వాత సుజీత్‌ని కాకుండా మరో డైరెక్టర్ కోసం వేటలో పడినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఐతే ఫైనల్‌గా ఆ చిత్రం కోసం ముచ్చటగా మూడోసారి వివి వినాయక్నే నమ్ముకున్నట్టు సమాచారం. ఇందులో నిజం ఎంత అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలిసే ఛాన్స్ లేదు. Also read : Pooja Hegde: సిటీలో ఖరీదైన ఇంటికి ప్లాన్ చేస్తున్న కన్నడ బ్యూటీ