న్యూఢిల్లీ: సినీ ఇండస్ట్రీ (Corona positive Cases In Bollywood)లో వరుసగా కరోనా కేసులు నమోవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కోవిడ్19 బారిన పడింది. ఆ తర్వాత అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యులకు కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా మరో నటికి కరోనా సోకింది. ప్రముఖ టీవీ నటి శ్రేణు పరీఖ్ (Shrenu Parikh) తాను కరోనా పాజిటివ్‌ అని వెల్లడించింది. తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స, ఫ్రీగా కోవిడ్ టెస్టులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తాను గుజరాత్, వడోదర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో నటి శ్రేణు పరీఖ్ ఓ పోస్ట్ చేసింది. ‘అందరకీ హాయ్.. ఎంత జాగ్రత్తపడినా కొన్ని రోజుల కిందట నాకు కరోనా సోకింది. కోవిడ్19 పాజిటివ్‌ (Shrenu Parikh COVID19 positive)గా తేలిన తర్వాత ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాను. కరోనా వారియర్స్‌కు ధన్యవాదాలు. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించాలని కోరుతూ’ శ్రేణు పరీఖ్ పోస్ట్ చేసింది.CBSE టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి 
 



కనిపించని మహమ్మారి
‘ఎంతో జాగ్రత్తగా ఉన్నా చివరికి కరోనా వైరస్ సోకింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. మనం కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని’ తన పోస్టులో పేర్కొంది. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దో.. ఎక్ బార్ ఫిర్’, ఇష్క్‌బాజ్ సీరియల్స్‌తో పాటు పలు షోలలో పాల్గొని ప్రేక్షకును మెప్పించింది నటి శ్రేణు పరీఖ్. Depression: ఈ యోగాసనాలతో డిప్రెషన్ పరార్!