ఏప్రిల్ 20వ తేదీన విడుద‌ల కాబోతున్న 'భ‌ర‌త్ అనే నేను' చిత్ర ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి పోస్టర్స్, సాంగ్స్‌, టీజ‌ర్ విడుద‌ల చేస్తూ అభిమానుల‌లో సినిమాపై భారీ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే టైటిల్‌ సాంగ్‌‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్‌ ఈ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు 'ఐ డోంట్‌ నో' అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు.  ఈ పాట‌ని బాలీవుడ్ న‌టుడు ఫ‌ర్హాన్ అక్తర్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో పాటగా విడుద‌లైన ఈ లిరిక్ కూడా సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆకట్టుకొంటోంది. ఈ పాట పాడినందుకు ఫ‌ర్హాన్‌కి మ‌హేష్ ప్రత్యేక కృత‌జ్ఞత‌లు చెప్పాడు. 'భ‌ర‌త్ అనే నేను' చిత్రానికి కొర‌టాల శివ దర్శకత్వం వహించగా ..ఇందులో మ‌హేష్‌ బాబు, కైరా అద్వానీలు ప్రధాన పాత్రలు పోషించారు. శరత్‌ కుమార్, ప్రకాష్ రాజ్‌, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన మహేష్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో 'భరత్‌ అనే నేను' పై అంచనాలు పెరిగాయి. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించ‌నున్నాడు. మ‌రి తాజాగా విడుద‌లైన సాంగ్‌ని మీరు కూడా విని ఎంజాయ్ చేయండి.