‘నీదీ నాదీ ఒకే కథ’.. శ్రీ విష్ణు హీరోగా, వేణు వూడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చదువే జీవిత పరమావధి కాదని.. జీవితమంటే స్వేచ్ఛగా మనసుకు నచ్చినట్లు జీవించడమని ఒక ఫిలాసఫికల్ థీమ్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమాను చూసిన పలువురు తమిళ నిర్మాతలు ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనడానికి పోటీ పడ్డారని వార్తలు వస్తున్నాయి.


ఈ క్రమంలో ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌ థాను కొనుగోలు చేసినట్లు.. త్వరలోనే ధనుష్‌ని హీరోగా పెట్టి ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. ఇటువంటి థీమ్‌తోటే గతంలో ధనుష్, రఘువరన్ బీటెక్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ వడ చెన్నై, మారి 2, ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌ అనే చిత్రాలలో నటిస్తున్నారు.