ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కంటికి గురువారం మరోసారి శస్త్రచికిత్స జరిగిందని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. గత నాలుగు నెలలుగా పవన్‌ కంటికి ఇన్‌ఫెక్షన్ సోకి బాధపడుతున్న నేపథ్యంలో నెల రోజుల క్రితం ఆయన కంటికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత భీమవరం కేంద్రంగా జరిగిన జనసేన పోరాట చైతన్య యాత్రలో పవన్ బిజీ అయ్యారు. అయితే, ఈ బిజీ షెడ్యూల్స్‌తో సతమతమవుతూ పవన్ తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో ఆయన కంటికి ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువయిందని, దీంతో వైద్యుల సలహా ఆయన మరోసారి కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని జనసేన మీడియా విభాగం పేర్కొంది. ఈమేరకు జనసేన విభాగం తాజాగా ఫేస్‌బుక్ ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేసింది. 


[[{"fid":"173204","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Janasena party press notes","field_file_image_title_text[und][0][value]":"జనసేన పార్టీ ప్రెస్ నోట్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Janasena party press notes","field_file_image_title_text[und][0][value]":"జనసేన పార్టీ ప్రెస్ నోట్"}},"link_text":false,"attributes":{"alt":"Janasena party press notes","title":"జనసేన పార్టీ ప్రెస్ నోట్","class":"media-element file-default","data-delta":"1"}}]]