బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్.. నిత్యం ఏదో అంశంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ .. ముంబైలో జరిగిన ఉమంగ్ 2020 ఫెస్టివల్ లో తళుక్కున్న మెరిసింది. ఉమంగ్ 2020 ఫెస్టివల్ కోసం ప్రసిద్ధ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరతో క్రేజీగా కనిపించింది. ఉమంగ్ 2020 ఫెస్టివల్ లో దాదాపు బాలీవుడ్ తారలంతా పాల్గొన్నారు. ఐతే వారందరిలో బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీగా జాన్వీ కపూర్ నిలవడం విశేషం. ఉమంగ్ 2020 ఫెస్టివల్ లో పాల్గొనేందుకు కోసం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన రెడ్ శారీలో హాట్ హాట్ గా జాన్వీ  కనిపించింది. తాజాగా ఆ చిత్రాలను డిజైనర్ మనీష్ మల్హోత్రాలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో జాన్వీ కపూర్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



జాన్వీ కపూర్ ప్రస్తుతం అప్ కమింగ్ మూవీస్ తో  బిజీగా ఉంది. ఆమె నంటించిన గుంజన్ సక్సేనా చిత్రం ది కార్గిల్ గర్ల్ అనేది ఉప శీర్షిక.. ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాకు షరాన్ శర్మ దర్శకత్వం వహించారు. దేశంలో మొట్ట మొదటి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆమె కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నప్పటి కథ ఆధారంగా చిత్ర కథ నడుస్తుంది. మరోవైపు జాన్వీ కపూర్ .. దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించనున్న దోస్తానా-2 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, లాస్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..