శ్రీదేవి మరణంపై పాక్ నటి సజల్ అలీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి చివరి సినిమా 'మామ్'లో కుమార్తెగా సజల్ అలీ నటించారు. 'ఈ రోజు నా తల్లిని మరోసారి కోల్పోయాను' అని అన్నారు. యాదృచ్చికంగా 'మామ్' సినిమా షూటింగ్ సమయంలో సజల్ తల్లి మరణించారు. యా సమయంలో సజల్ కు శ్రీదేవి అండగా ఉండి ధైర్యం చెప్పింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తల్లి మరణంతో తీవ్రమైన బాధలో ఉన్న సజల్‌ను శ్రీదేవి అక్కున చేర్చుకొని సొంత కూతురిలా చూసుకున్నారు. ఈ అనుభవాన్ని తాను కేవలం సినిమాలా మాత్రమే చూడటం లేదని.. ఈ అనుబంధం తన హృదయాన్ని తాకిందన్నారు. సాధారణంగా శ్రీదేవి తన సహచర నటులతో తొందరగా కలిసిపోరు. సెట్స్‌లో పూర్తి ప్రొఫెషనల్‌గా ఉంటారు. కానీ, సజల్ విషయంలో మాత్రం భిన్నంగా స్పందించారు. ఆదివారం సజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మరోసారి నా తల్లిని కోల్పోయా అని పోస్ట్ చేశారు.