టాలీవుడ్  లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ఈ సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలే 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని ఓ పాట ఫుల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును. . 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలోని  'మైండ్ బ్లాక్' ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. తొలిసారిగా ఈ పాట ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించారు. మాస్ బీట్ తో వచ్చిన పాట .. ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దీంతో సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. పాటలో మహేష్ బాబు, హీరోయిన్ రష్మిక మందన్న ఇరగదీశారు.



Read Also: పవన్ ఫ్యాన్స్‌కు రెండు రోజుల్లో పండగ