Rajeswari Ray Mohapatra Passed away: మధ్యకాలంలో సినీ పరిశ్రమతో పాటు టీవీ పరిశ్రమలో కూడా వరుస విషాద ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రముఖ ఒడియా టీవీ నటి రాజేశ్వరి రే మహా పాత్ర అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా మెదడు, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె కొద్దిగా కాలం క్రితం జాయిన్ అయ్యారు. సదరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆమె కన్నుమూశారు. ఇక ఆమె మరణ వార్తతో ఒరియా టీవీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ఒడియా టీవీ, సహా సినీ నటులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. నిజానికి తాను క్యాన్సర్ తో బాధపడుతున్నానని క్యాన్సర్ తో పోరాటానికి సిద్ధమయ్యానంటూ 2019వ సంవత్సరంలోనే రాజేశ్వరి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేయడం ద్వారా వెల్లడించారు. అప్పుడే ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, సినీ ప్రేమికులు ప్రార్థించారు. కానీ ఆమె క్యాన్సర్ కి బలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వాభిమానం అనే ఒడియా సీరియల్ తో రాజేశ్వరి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: Liger Trailer: విజయ్ దేవరకొండ 'లైగర్‌' ట్రైలర్ వచ్చేసింది... రౌడీ స్టార్ నెక్ట్స్ లెవల్ అంతే..


Read Also:Urfi Javed: అరాచకమైన డ్రెస్లో ఉర్ఫీ జావేద్.. అన్నీ కనిపించేలా అందాల విందు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook