శర్వానంద్ అప్‌కమింగ్ సినిమా రణరంగం టీజర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. సినిమాపై ఆసక్తి పెంచేలా ''కొందరికి అతడు నేరస్తుడు.. మిగిలిన వారికి అతడు హీరో'' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో శర్వానంద్ చెప్పిన ఇతర డైలాగ్స్ ఆడియెన్స్‌ని మరింత ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ''దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది.. కానీ.. మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి.. అంటూ, కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్స్ సినిమాలో అతడి పాత్రను మరింత ప్రత్యేకం చేస్తున్నాయి. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న రణరంగం ఆగస్టులో థియేటర్లలోకి రానుంది.