నాగచైతన్య, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సవ్యసాచి సినిమా వినూత్నమైన ట్రైలర్ ప్రోమోలతో ఆడియెన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చైతూ సరసన నిధి అగర్వాల్ జంటగా నటించింది. రేపే సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సవ్యసాచి సినిమాలో ఓ నాటక ప్రదర్శనకు సంబంధించిన సన్నివేశం నుంచి సుభద్ర పరిణయం ట్రైలర్ పేరిట విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం చైతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.