కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ ఎందరో ప్రాణాలు బలితీసుకుంటోంది. లాక్‌డౌన్ (LockDown 5.0) వల్ల పని దొరకక ఇద్దరు టీవీ నటీనటులు ఆత్మహత్య (TV Actors Commit Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆ నటీనటులు సోదరుడు, సోదరి కావడం గమనార్హం.. అందులోనూ ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజులకు కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలను గుర్తించారు. చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇండియా గ్లీట్జ్ రిపోర్ట్ చేసిన వివరాలిలా ఉన్నాయి..  నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటుడు శ్రీధర్, ఆయన సోదరి జయ కళ్యాణి ఇద్దరూ టీవీ ఆర్టిస్టులే. వీరు చెన్నైలోని కొడుంగయూర్ ముత్తమిజ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వారి ఇంటి నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నటీనటులు శ్రీధర్, జయ కళ్యాణి మృతదేహాలను కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు. నేటి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు   


మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల షూటింగ్స్ రద్దయిన కారణంగా పని దొరకకపోవడం, తద్వారా ఆర్థిక సమస్యలు తలెత్తి నటుడు, నటి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, గత నెలలో హిందీ ఆర్టిస్టులు ప్రేక్షా మెహతా, మన్మీత్ గ్రేవల్ ఆత్మహత్య చేసుకోవడం విదితమే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్