పెరుగు లేకుండా భోజనం ఊహించలేం. పంచభక్ష పరమాన్నం పెట్టినా పెరుగు ఉండాల్సిందే. భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకి రావని ఆయుర్వేదం చెబుతుంది. ఆహార పదార్థాలలో దీనిని 'ఆమృతం'తో పోలుస్తారు. మన దేశంలో పెరుగు సంపూర్ణాహారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెరుగు గురించి ఈ విషయాలు తెలిస్తే .. ఇష్టం లేనివారుసైతం తప్పక పెరుగు తింటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.  పెరుగు ఎలాంటి వాతవ్యాధినైనా జయిస్తుంది. బరువును పెంచుతుంది, శరీరపుష్టిని కలిగిస్తుంది. జీలకర్ర పొడిని ఓ కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతుంది. 


2.  జలుబు ఉంటే పెరుగు తినకూడదు అంటారు.. కానీ జలుబుకు పెరుగు విరుగుడు. 


3. మూత్ర సంబంధ రోగాలకు, జిగురు విరేచనాలకు పెరుగు ఉత్తమం. 


4. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండేవాళ్ళకు పెరుగు అమృతం వంటిది. 


5. పెరుగు రెగ్యులర్ గా తీసుకుంటే ఎపెండిసైటిస్ రాదు.


6. కామెర్లు వచ్చిన వారికి పెరుగు ఒక చక్కని ఔషధం. కామెర్లు వచ్చిన వారికి పెరుగు, మజ్జిగ అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కూడా కలిపి ఇస్తే మరింతగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.


7.  కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్నిస్తుంది.


8. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది.


9. నిద్రపట్టని వారికి పెరుగు ఒక వరం. ఆయుర్వేదంలో గేదె పెరుగు నిద్ర పట్టని వారికి వాడమని చెబుతారు.


10. చర్మవ్యాధులు, చర్మ కాంతులకు పెరుగు, మజ్జిగ అమోఘంగా పనిచేస్తుందని అంటారు.