ఔరంగాబాద్: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలపై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14 మంది వలస కూలీలు మృతిచెందగా, మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మహరాష్ట్రలోని జల్నా - ఔరంగాబాద్ స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. రైలు ప్రమాదం: 16కి చేరిన మృతులు సంఖ్య


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్‌డౌన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్‌ వలస కూలీలు సొంతూరుకు బయలుదేరారు. అలసిపోయిన వలస కూలీలు రైలు పట్టాలపై నిద్రించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మే 8న ఉదయం 4 గంటల ప్రాంతంలో పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికుల మీద నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. వలస కూలీలతో పాటు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. 


ప్రమాదం సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. ఔరంగాబాద్ ఆసుపత్రికి బాధితులను తరలించారు. ఘటనపై విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!