తెలంగాణలో రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ నేడు విడుదల చేసింది. గురువారం ఐదు రాష్ట్రాల పార్టీ ఇంచార్జులతో మంతనాల అనంతరం పార్టీ ఈ జాబితాను విడుదల చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన తొలి జాబితా సైతం ఈరోజే విడుదలైంది.


 28మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితా వివరాలిలా ఉన్నాయి..
1) కూకట్‌పల్లి - మాధవరం కాంతారావు
2) రాజేంద్రనగర్‌ - బద్దం బాల్‌రెడ్డి
3) శేరిలింగంపల్లి - జి. యోగానంద్‌
4) మలక్‌పేట్‌ - ఆలె జితేంద్ర
5) చార్మినార్‌ - టి.ఉమామహేంద్ర
6) చంద్రాయణగుట్ట - సయ్యద్‌ సహేజాది
7) యాకత్‌పురా - చర్మాని రూపరాజ్‌
8) బహదూర్‌పురా - అనీఫ్‌అలీ
9) సిర్పూర్ కాగజ్ నగర్ - డా.శ్రీనివాసులు
10) ఆసిఫాబాద్‌ - అజ్మీరా ఆత్మరామ్‌ నాయక్‌
11) ఖానాపూర్‌ - సట్ల అశోక్‌
12) నిర్మల్‌ - డా. సువర్ణారెడ్డి
13) నిజామాబాద్‌ అర్బన్ ‌- యెండల లక్ష్మీనారాయణ
14) జగిత్యాల - ముదుగంటి రవీందర్‌రెడ్డి
15) రామగుండం - బల్మూరి వనిత
16) సిరిసిల్ల - నర్సాగౌడ్‌
17) సిద్దిపేట - నాయిని నరోత్తమ్‌ రెడ్డి 
18) దేవరకద్ర - అగ్గాని నరసింహులుసాగర్‌
19) వనపర్తి - కొత్త అమరేందర్‌రెడ్డి
20) నాగర్‌కర్నూల్ ‌- నేదనూరి దిలీప్‌చారి
21) నాగార్జునసాగర్‌ - కంకణాల నివేదిత
22) ఆలేరు - దొంతిరి శ్రీధర్‌రెడ్డి
23) ఇల్లందు - ఎం.నాగస్రవంతి
24) వైరా - భూక్య రేష్మాబాయి
25) అశ్వారావుపేట - డా.భూక్య ప్రసాదరావు
26) స్టేషన్‌ఘన్‌పూర్ - పెరుమాండ్ల వెంకటేశ్వర్లు
27) వరంగల్ వెస్ట్ - ఎం.ధర్మారావు
28) వర్దన్నపేట - కొత్త సారంగరావు