జమ్ము కాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 ని రద్దు చేయడం.. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం లాంటి భారత ప్రభుత్వ నిర్ణయాలతో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొందరు స్థానిక ప్రజానికంతో పాటు ప్రతిపక్షాల పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్థానిక పార్టీలైనా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు పోరుబాటకు పట్టేందుకు సిద్ధమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను నిన్న అరెస్టు చేసి అతిథి గృహానికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీగా భద్రతా బలగాల మొహరింపు


మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రాష్ట్ర  ప్రజలు సంయమనం పాటించాలని అధికారులు కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు  ఇప్పటికే వేలాది మంది భద్రతా సిబ్బందిని నియమించి భద్రతను కట్టుదిట్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ శ్రీనగర్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా 370పై నిర్ణయం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. 


మూడు నెలలకు సరిపడా ఆహార నిల్వలు


ఆందోళనలను నిలువరించేందుకు  కశ్మీర్ లో కొన్ని పరిమితులు విధించాల్సి ఉంది.ముందస్తు చర్యలో భాగంగా  కశ్మీర్‌లో  మూడు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు నిల్వలు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తరలించారు. మూడు నెలలకు సరిపడా గోధుమలు, బియ్యం, మాంసం, గుడ్లు, ఇంధనం వంటి వాటిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొంటామని... ఆహార పదార్థాల విషయంలో ఎటువంటి కొరతా ఉండదని అధికారులు స్పష్టం చేశారు.