గుజరాత్ ఎన్నికల్లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అయితే మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీ పట్టునిలుపుకోలేక పోయింది. వాద్నగర్ లోని ఉన్జా నియోజకవర్గంలో బీజేపీ పరాజయం పాలైంది. ఇక్కడ బీజేపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పటేల్ నారాయణ్ భాయ్ లల్లుదాస్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశా పటేల్ 19 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ నియోజకవర్గంలో ఆశా పటేల్ కు 81,797 ఓట్లు రాగా, లల్లుదాస్ కు 62,268 ఓట్లు వచ్చాయి. ఇదే నియోజకవర్గంలో 2012లో లల్లుదాస్ 25,000 ఓట్ల మెజారిటీతో ఆశా పటేల్ పై గెలిచారు.