Corona Third Wave: కరోనా మహమ్మారి సంక్రమణ మళ్లీ నెమ్మదిగా పెరుగుతోంది. ఇండియాలో కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్ తప్పకుండా వస్తుందని మరోసారి హెచ్చరికలు జారీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి (Corona pandemic)సంక్రమణ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 4 లక్షల 60 వేల 678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచం మొత్తం మీద కేసుల సంఖ్య 19.89 కోట్లు దాటింది. గత 24 గంటల్లో 7 వేల 115 మంది మరణించారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే గత 24 గంటల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇండియాలో 41 వేల 831 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..అమెరికాలో 21 వేలు, బ్రెజిల్‌లో 20 వేలు, ఇరాన్‌లో 32 వేలు, ఇండోనేషియాలో 30 వేల కేసులు నమోదయ్యాయి. ఇక ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో కేసులు పెరగడంతో నిన్నటి నుంచి ఎమర్జెన్సీ ప్రకటించారు. 


దేశంలో గత వారం రోజుల్నించి కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కరోనా థర్డ్‌వేవ్‌(Corona Third Wave)పై మరోసారి హెచ్చరికలు జారీ అయ్యాయి. దేశంలో కరోనా థర్డ్‌వేవ్ కచ్చితంగా వస్తుందని..అయితే ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మండలి హెచ్చరించింది. వ్యాక్సిన్, కోవిడ్ గైడ్‌లైన్స్, మాస్క్ మాత్రమే ప్రజల్ని కాపాడతాయని చెబుతోంది. కేరళలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంపై రీసెర్చ్ జరుగుతోందని పేర్కొంది. దేశంలో డెల్టా వేరియంట్ (Delta variant)మరోసారి విరుచుకుపడే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. 


Also read: అసోం-మిజోరం సరిహద్దుతో పాటు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదానికి కీలక నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook