India Coronavirus Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో కంటే ప్రస్తుతం కోవిడ్ 19 (Covid-19) కేసులు, మరణాల సంఖ్య రెండూ కూడా తగ్గుముఖం పట్టాయి. నిన్న కూడా 20వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో గురువారం (డిసెంబరు 31న) కొత్తగా 20,036 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 256 మంది ప్రాణాలు కోల్పోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,02,86,710 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,48,994 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 95.92 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also Read: New Year's Eve: దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్ర‌ధాని శుభాకాంక్షలు


ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి 23,181 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (cured cases) వారి సంఖ్య 98,83,461 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,54,254 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. Also Read: Pfizer-BioNTech వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి WHO అనుమతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook