Covid19 Compensation: కోవిడ్19 వైరస్‌తో మరణించిన కుటుంబాలకు భారీ ఆర్ధిక సహాయం. నిర్దేశిత నమూనాలో దరఖాస్తు చేసుకోండిలా..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ప్రచారం సాగుతోంది. మరి ఇది ఎంతవరకూ నిజం..ఆర్ధిక సహాయం మాటేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona Pandemic) కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబసభ్యులు మరణిస్తుండటంతో ఆ కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుందనే ప్రచారం ఇటీవల ముమ్మరంగా సాగుతోంది. అంతేకాదు నిర్దేశిత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలంటూ..నమూనా దరఖాస్తును కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకూ నిజమో ఇప్పుడు పరిశీలిద్దాం. 


వాస్తవానికి కోవిడ్ 19 (Covid19) బారినపడి మరణించిన కుటుంబసభ్యులకు రాష్ట్ర విపత్తుల నివారణ నిధి నుంచి 4 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయంగా చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వం(Central government) మార్చ్ 14వ తేదీన రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తుల నివారణ నిధి కింద చేపట్టే సహాయక పనుల్లో 75 శాతం నిధుల్ని కేంద్రం, 25 శాతం నిధుల్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కరోనా మృతుల సంఖ్య భారీగా ఉండటంతో పరిహారం చెల్లింపనేది సాధ్యం కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం ఆ ఆదేశాల్ని ఉపసంహరించుకుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకున్న ఆదేశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ పాత ఉత్తర్వులు వైరల్ అవుతుండటంతో కొంతమంది నిజమని నమ్ముతున్న పరిస్థితి. మరోవైపు ఇదే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు(Supreme Court) లో విచారణ జరుగుతోంది


Also read: India Corona Update: ఇండియాలో గణనీయంగా తగ్గిన కరోనా ఉధృతి, నిలకడగా మరణాల సంఖ్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook