India Coronavirus Latest Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి విస్తరిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా శుక్రవారం కూడా 18వేల కేసులే నమోదయ్యాయి. గత 24గంటల్లో (జనవరి 9న) కొత్తగా 18,645 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 201 మంది మరణించారు. కొత్తగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,04,50,284 కి పెరగగా... మరణాల సంఖ్య 1,50,999 కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కేసులతోపాటు రికవరీల సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది. కరోనా (Coronavirus) నుంచి నిన్న 19,299 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (cured cases) వారి సంఖ్య 1,00,75,950 కి చేరింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,23,335 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.42 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also read: Farmers Protest: విషం తాగి రైతు బలవన్మరణం


దేశవ్యాప్తంగా నిన్న 8,43,307 కరోనా (Covid-19) నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. వీటితో కలిపి జనవరి 9వ తేదీ వరకు మొత్తం 18,10,96,622 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది. Also Read: Maharashtra: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది శిశువుల మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook