India Coronavirus Latest Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో భారీగా నమోదైన కేసులు, మరణాల సంఖ్య.. కొన్నిరోజులుగా భారీగా తగ్గింది. తాజాగా బుధవారం కూడా 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో (జనవరి 6న) కొత్తగా 20,346 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 222 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,03,95,278 కి చేరగా.. మరణాల సంఖ్య 1,50,336 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసులతోపాటు రికవరీల సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతోంది. తాజాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కోటి మార్క్ దాటింది.  కరోనా (Coronavirus) నుంచి నిన్న 19,587 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (cured cases) వారి సంఖ్య 1,00,16,859 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,28,083 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. Also Read: David Warner: వికెట్ తీసిన ఆనందంలో మహ్మద్ సిరాజ్.. వీడియో


ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 9,37,590 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. జనవరి 6వ తేదీ వరకు మొత్తం 17,84,00,995 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది. Also Read: Kumbh Mela 2021: జనవరి 14న కుంభమేళా ప్రారంభం.. గంగానదీ స్నానాల ప్రాముఖ్యత తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook