భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భోపాల్ లోక్ సభ స్థానం అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. రాజ్‌ఘడ్‌లో ఓటు హక్కు కలిగివున్న దిగ్విజయ్ సింగ్‌ సకాలంలో అక్కడికి చేరుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడంపై పశ్చాత్తాపం వ్యక్తంచేసిన దిగ్విజయ్ సింగ్.. రానున్న ఎన్నికల సమయానికి భోపాల్‌లోనే తన ఓటు హక్కును నమోదు చేసుకుంటానని తెలిపారు. 


సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. సాధ్యమైనంత వరకు తాను రాజ్‌ఘడ్ చేరుకుని ఓటు వేసేందుకే ప్రయత్నిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.