ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధంమైంది. కేంద్ర ఎన్నికల సంఘం  నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వారం చివర్లో లేదా వచ్చేవారం మొదట్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఏప్రిల్‌ నుంచి మే నెలవరకు 7-8దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం సమకూర్చే పనిలో ఉంది. వచ్చేవారం ఈ సమయానికి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశుముంది. 


వాస్తవానికి లోక్‌ సభ పదవీకాలం జూన్‌ 3నాటికి పూర్తికానుంది. దీంతో పాటు కొన్ని రాష్ట్రాల పాలనా వ్యవధి కూడా త్వరలోనే పూర్తవనుంది. ఈ కారణంగా నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.